- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > మృతి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన డీఆర్డీఏ అధికారి
మృతి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన డీఆర్డీఏ అధికారి
by Ratna Kumari |
నర్వ మండలంలోని యాంకీ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు జజ్జలి అంజన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారి వెంకట్రాములు పరామర్శించారు.

X
దిశ, నర్వ: నర్వ మండలంలోని యాంకీ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు జజ్జలి అంజన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారి వెంకట్రాములు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అంజన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన వెంకట్రాములు, వారికి ధైర్యం చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అంజన్న అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, ప్రభుత్వం తరఫున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీవో రాఘవేందర్, ఏపీవో గౌరీశంకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, టీఏ శ్రావణి, పీఎస్ అనురాధ, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story






