- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనుషుల ప్రాణాలు అంటే లెక్క లేదా?
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని సదాశివనగర్ మండలంలోని వర్గల్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, సదాశివనగర్ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని సదాశివనగర్ మండలంలోని వర్గల్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వంకిపోయిన ఇనుప విద్యుత్ స్తంభానికి లైవ్ వైర్లు తాకడంతో స్తంభంలో విద్యుత్ ప్రవహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై ఏళ్ల తరబడి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
సిమెంట్ స్తంభాల ఏర్పాటు కోసం అనుమతులు వచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదకర పరిస్థితి కారణంగా పశువులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మనుషుల ప్రాణనష్టం సంభవించేలోపే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న ఇనుప స్తంభం స్థానంలో కొత్త సిమెంట్ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.






