బీజేపీ సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో నిధుల పట్ల వివక్ష

by Disha Web Desk 13 |
బీజేపీ సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో నిధుల పట్ల వివక్ష
X

దిశ, చిన్నశంకరంపేట: బీజేపీ సర్పంచ్‌లపై నిధుల విషయంలో వివక్ష చూపిస్తున్నారని నిరసిస్తూ.. విన్నూత నిరసన చేపట్టారు. చేగుంట సర్వసభ్య సమావేశం ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి జడ్పిటిసి మోదం శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాస్, తహశీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీవో ఉమాదేవి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


అనంతరం సమావేశం కొనసాగుతుండగా.. అన్ని గ్రామాల్లో నిధులు కేటాయించారు కానీ బీజేపీ సర్పంచులు ఉన్న కర్నాల్ పల్లి, గొల్లపల్లి, చితోజి పల్లి మూడు గ్రామాల్లో నిధులు కేటాయించడంలో అధికారులు వివక్ష చూపిస్తున్నారని గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి. చిటోజి పల్లి సర్పంచ్ ప్రవళిక లు సమావేశంలో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మూడు గ్రామాల పై వివక్ష తగదని నిరసిస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

Next Story

Most Viewed