- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ యాసను పొగిడిందా.. అవమానించిందా? ఈషా రెబ్బా వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba)నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తన పర్సనల్ లైఫ్ పరంగా.. సినిమాలతో నెట్టింట ఈషా పేరు మార్మోగిపోతోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా (Eesha Rebba)నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తన పర్సనల్ లైఫ్ పరంగా.. సినిమాలతో నెట్టింట ఈషా పేరు మార్మోగిపోతోంది. త్వరలో ఈ అమ్మడు ‘ఓం శాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shanti)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తరుణ్ భాస్కర్ సరసన నటించింది. హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఏఆర్ సజీవ్ (AR Sajeev)దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకోగా.. జనవరి 30న థియేటర్స్లోకి రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా రెబ్బా కాంట్రవర్సీ కామెంట్లు చేసి చిక్కుల్లో పడింది. తెలంగాణ, ఆంధ్ర యాసపై పలు కామెంట్లు చేసి సినిమా విడుదలకు ముందు నెగెటివిటీని ఎదుర్కొంటుంది. ‘‘తెలంగాణచాలా కఠినంగా ఉంది. మాట్లాడితే కొట్టినట్లుగా ఉంటుంది. కానీ బాగుంటుంది. అదే ఆంధ్రలో బూతులు మాట్లాడినా.. చాలా మర్యాదగా అనిపిస్తుంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు అమ్మాయిని అని చాలామంది పొగిడేశారు.
కానీ దానివల్ల అవకాశాలు రాలేదు. అంతేకాకుండా తెలుగు అమ్మాయిని అని ఎక్కడా చెప్పుకోవద్దని చాలామంది నాకు సలహా ఇచ్చారు’’ అని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తెలంగాణ యాసను పొగిడిందా? లేక అవమానించిందా? కొట్టినట్లు ఉండటం ఏంటి ఈషా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలుగు అమ్మాయి అయి ఉండి ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు.






