- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో భక్తుల కోలాహలం.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు.

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో, క్యూ లైన్లు వెలుపల వరకు సాగాయి. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పారిశుధ్యం, తాగునీరు, అన్నప్రసాద వితరణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 72,724 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,786 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.59 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ వెల్లడించింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






