అదే నా ప్రథమ లక్ష్యం: రేగా కాంతారావు

by Dishafeatures2 |
అదే నా ప్రథమ లక్ష్యం: రేగా కాంతారావు
X

దిశ,మణుగూరు : పినపాక నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్షమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావును అశ్వాపురం మండల టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలంలోని పలు అభివృద్ధి పనులపై నాయకులు రేగాతో చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ.. అశ్వాపురం మండలంలోని ప్రతి యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని నాయకులకు తెలిపారు. మండలంలోని ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ముఖ్యంగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జునరావు, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్నె అశోక్ కుమార్, మొగిళ్ల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed