ఈ ఆసుపత్రిలో వాటికే ఇంపార్టెంట్: డిప్యూటీ డీఎంహెచ్ఓ

by Dishanational1 |
ఈ ఆసుపత్రిలో వాటికే ఇంపార్టెంట్: డిప్యూటీ డీఎంహెచ్ఓ
X

దిశ, కోరుట్ల: ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తామని, అన్ని రకాల సేవలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గర్భిణీ మహిళలకు సేవలు ఏ విధంగా అందుతున్నాయని, వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా తమను సంప్రదించాలని సూచించారు. అనంతరం కేసీఆర్ కిట్ అందజేశారు. తల్లి, పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పీ హెచ్ సీ ల ఆశావర్కర్, ఏఎన్ఎం, సూపర్ వైజర్ల పనితీరు గురించి తెలుసుకున్నారు.102 సేవలు వాటి రూట్ మ్యాప్ గురించి తెలుసుకుని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు శ్రీలక్ష్మి, సునీత రాణి, హెచ్ఈఓ భూమేశ్వర్, సూపర్ వైజర్ ధనుంజయ్, స్టాప్ నర్సు కవిత రబ్బానీ, రియాజ్, సిబ్బంది పాల్గొన్నారు.


Next Story