అచ్చెన్నాయుడుకు డిప్యూటీ సీఎం సవాల్

by Disha Web Desk 13 |
అచ్చెన్నాయుడుకు డిప్యూటీ సీఎం సవాల్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని విమర్శించారు. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న సంబరాలు ఇవే ఆఖరివి అవుతాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నాడు. టీడీపీ 160 సీట్లు వచ్చేయడానికి మేము గాజులు వేసుకుని కూర్చుంటాం అంటూ సెటైర్లు వేశారు.


వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన సవాల్ ను స్వీకరించే దమ్ము అచ్చెన్నాయుడుకు ఉందా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించే సొల్లు మాటలు నమ్మొద్దని ప్రజలకు హితవు పలికారు. దళారీ మాటలు పట్టించుకోవద్దంటూ సూచించారు.

Next Story

Most Viewed