- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్లో తీవ్ర విషాదం.. బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ ఆకస్మిక మృతి
ఐపీఎల్ బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ జాన్ విలియమ్ (76) ముంబై హోటల్లో మృతి. MI-KKR మ్యాచ్ తర్వాత విషాదం. బీసీసీఐ సంతాపం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

దిశ, వెబ్ డెస్క్: ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైన ఐపీఎల్ 2026లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మ్యాచుల ప్రసారాల విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న 76 ఏళ్ల బ్రిటిష్ ఇంజనీర్ జాన్ విలియమ్ లాంగ్ఫోర్డ్ ముంబైలోని ఒక హోటల్ గదిలో విగతజీవిగా కనిపించారు. మార్చి 24 నుండి ఆయన ముంబైలోని 'ట్రైడెంట్' హోటల్లో ఉంటున్నారు. మార్చి 29న వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ (MI)- కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన తన గదికి చేరుకున్నారు. అయితే, మరుసటి రోజు (మార్చి 30) ఉదయం హోటల్ సిబ్బంది ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో, మాస్టర్ కీ తో గది తలుపులు తెరిచి చూడగా ఆయన నేలపై స్పృహ లేకుండా పడి ఉన్నారు.
వెంటనే ఆయనను బాంబే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తేలినప్పటికీ, దీనిని 'అసహజ మరణం' (Accidental Death Report - ADR)గా నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా బ్రాడ్కాస్టింగ్ రంగంలో విశేష సేవలందించిన జాన్ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఆయన మృతితో ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే ఇలాంటి తీవ్ర విషాదం నెలకొంది.






