చనిపోయిన షార్క్‌లో సరికొత్త రోగం.. ఇదే మొదటి కేస్ అన్న వైద్యులు

by Dishafeatures2 |
చనిపోయిన షార్క్‌లో సరికొత్త రోగం.. ఇదే మొదటి కేస్ అన్న వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: శాస్త్రవేత్తలు మరో కొత్త రోగాన్ని గుర్తించారు. దీనిని ఓ చనిపోయిన షార్క్‌ చేపలో గుర్తించారు. షార్క్‌కు పోస్ట్ మార్టం చేయగా ఈ విషయం బయటపడింది. అయితే యూకేలోని కార్న్‌వాల్ బీచ్‌కు ఇటీవల ఓ గ్రీన్ ల్యాండ్‌లో ఉండే అరుదైన జాతి షార్క్ డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. అటుగా వెళ్తున్న కొందరు దాన్ని చూసి అధికారులకు తెలిపారు. దాంతో అధికారులు ఆ షార్క్‌కు పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులోనే ఆ షార్క్‌కు 'మెనింజైటిస్' అనే వ్యాధి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోనే ఇది తొలి కేసు అని వారు అన్నారు. ఈ షార్క్‌కు దాదాపు 100 సంవత్సరాలు ఉంటాయని వారు నిర్ధారించారు. షార్క్ మెదడు రంగు మారడంతో పాటు పూర్తిగా చెడిపోయిందని, షార్క్ చేప తలలోని బ్రెయిన్ ఫ్లూయిడ్ అంతా కూడా పొగమంచు మాదిరిగా మారిపోయిందని వైద్యులు వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed