దళితుల మధ్య చిచ్చు పెట్టిన దళిత బంధు

by Dishanational2 |
దళితుల మధ్య చిచ్చు పెట్టిన దళిత బంధు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : దళిత బంధు దళితుల మధ్య చిచ్చు పెడుతుంది. నాయకులు తమకు అనుకూలంగాఉన్న వారికే అవకాశం కల్పిస్తుడటంతో మిగతావారు ఆందోళన చెందుతూ నేతలు, లబ్ధిదారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోయిలకొండ మండలం వింజమూర్‌లో మంగళవారం రాత్రి దళితులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఒక ముఖ్య నేత తన అనుచరుడు, అతని బంధువులు, మిత్రులకు సంబంధించి మొత్తం ఆరుగురు లబ్ధిదారులను ఎంపిక చేశారని తేలడం‌తో ఓ వ్యక్తి అతనికి సంబంధించిన ఆరుగురిని ఎందుకు ఎంపిక చేస్తారు..? మిగతా వారిని ఎందుకు ఎంపిక చేయరు అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి దళిత బందు దక్కని వారు లబ్ధిదారులతో వాదనకు దిగినట్లు సమాచారం. రెండు గ్రూపుల వారు పరస్పర దాడులకు పాల్పడ్డారు. కారంపూడి చల్లుకుంటూ, ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడడం తో గద్వాల వడన్న, మాల తిరుపతయ్య, గద్వాల రాజేందర్, తదితరులకు గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అదే రాత్రి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా, సంఘటనకు గల పూర్తి వివరాలను స్థానిక ఎస్ఐ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు సేకరిస్తున్నారు. కాగా రెండు గ్రూపుల వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.



Next Story

Most Viewed