వడ్డీ లేని రుణాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన

by Jakkula.Mamatha |

సదాశివ నగర్ మండల కేంద్రంలో వెన్నెల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

వడ్డీ లేని రుణాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన
X

దిశ,సదాశివ నగర్: సదాశివ నగర్ మండల కేంద్రంలో వెన్నెల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కమ్యూనిటీ కోఆర్డినేటర్ అంజయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మహిళా సంఘాలు బ్యాంకులో నుంచి తీసుకున్న వడ్డీ లేని రుణాలను సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Next Story