మద్యం షాపును మూసేయాలని మహిళల నిరసన

by Dishanational1 |
మద్యం షాపును మూసేయాలని మహిళల నిరసన
X

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర జయరాం నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారని మహిళలు ఆరోపించారు. గురువారం సదరు దుకాణం ముందు కొంపల్లి కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. స్కూల్ దగ్గరలో చట్ట విరుద్ధంగా దుకాణం పెట్టారని, తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, మహిళా కార్యకర్తలు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Next Story