ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే మొగుడు.. షేర్ చేసుకోవడం అలవాటేనంటున్న ట్రిప్లెట్స్

by Dishafeatures2 |
ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే మొగుడు.. షేర్ చేసుకోవడం అలవాటేనంటున్న ట్రిప్లెట్స్
X

దిశ, ఫీచర్స్ : నవతరం భర్తలు ఒక్క తోడుతోనే సంసార సాగరాన్ని ఈదలేక అవస్థలు పడుతుంటే.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన ఓ యువకుడు ఏకంగా ముగ్గురు యువతులను పెళ్లి చేసుకున్నాడు. నడేగే, నటాషా, నటాలీ అనే ముగ్గురు కవలలు ఒకేసారి అతనికి ప్రపోజ్ చేసినట్లు తెలుస్తుండగా.. 32 ఏళ్ల లువిజో ఆ ముగ్గురిని ఒకేరోజున వివాహం చేసుకున్నాడు. కాగా ఆ దేశస్థులు ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం చట్టసమ్మతమే కావడం విశేషం.

ఇక ముగ్గురు యువతల ప్రేమను అంగీకరించడంపై లువిజో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. వారి మ్యారేజ్ ప్రపోజల్‌ను తిరస్కరించలేక పోయినట్లు చెప్పాడు. ఇది అనుకున్నంత తేలికైన నిర్ణయం కాదన్న లువిజో.. ' ముగ్గురిని పెళ్లి చేసుకోవడం పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. ఇతరుల ఒపీనియన్‌తో నాకు పనిలేదు. తల్లిదండ్రులకు నా నిర్ణయం నచ్చనందున ఈ పెళ్లికి హాజరు కాలేదు. కానీ ప్రేమకు పరిమితులు లేవని మాత్రం చెప్పగలను' అన్నాడు.


నిజానికి ఈ ట్రిప్లెట్స్‌లో ఒకరైన నటాలీతో ముందుగా ప్రేమలో పడినట్లు లువిజో తెలిపాడు. ఆ తర్వాత నటాలీ.. తన ఇద్దరు ట్విన్ సిస్టర్స్ నడేగే, నటాషాలను పరిచయం చేసినప్పుడు వారిద్దరు కూడా తనతో ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని లువిజోతో చెప్పినప్పుడు ఆశ్చర్యంతో దాదాపు మూర్ఛపోయాడని ముగ్గురు సిస్టర్స్ చెప్పుకొచ్చారు. ఇక తమకు చిన్నప్పటి నుంచి ప్రతి దాన్ని షేర్ చేసుకునే అలవాటుందన్న ఈ ట్రిప్లెట్స్.. ఇప్పుడు భర్తను పంచుకోవడం ఏమంత కష్టం కాదని వెల్లడించారు.


Next Story