- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన అధికారులు

X
దిశ,యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పర్యటన రద్దు అయ్యింది.
అయితే స్వల్ప అనారోగ్యం కారణంగానే ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి తిరుకల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను బాలాలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో గీతారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో రమేష్ బాబు, చైర్మన్ సతీమణి, తిరుమల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story