యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన అధికారులు

by Disha Web |
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దు.. పట్టువస్త్రాలు సమర్పించిన అధికారులు
X

దిశ,యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పర్యటన రద్దు అయ్యింది.

అయితే స్వల్ప అనారోగ్యం కారణంగానే ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి తిరుకల్యాణ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను బాలాలయంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో గీతారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో రమేష్ బాబు, చైర్మన్ సతీమణి, తిరుమల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story