- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. ఆ టికెట్ ఉంటే హాఫ్ డే లీవ్

X
దిశ, వెబ్డెస్క్: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 1990ల్లో కాశ్మీర్ పండిట్ల అణిచివేత నేపథ్యంలో తెరకెక్కిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ప్రకటించారు. ఉద్యోగులు ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు ఒకరోజు ముందు తెలియజేసి.. మరుసటి రోజు సినిమా టికెట్లను సమర్పించాలి అని ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు. కాగా, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా భారత ప్రధాని మోడీ ఈ చిత్రాని వీక్షించి.. సినిమా చాలా అద్భుతంగా ఉందని చిత్ర బృందాన్ని పొగిడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇప్పటికే బీజేపీ పాలిత చాలా రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు.
Next Story