ధాన్యం మొత్తం కొనాల్సిందే.. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

by Disha Web Desk 2 |
ధాన్యం మొత్తం కొనాల్సిందే.. ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. కొనుగోలు చేయకపోతే వరికి కనీస మద్దతు ధరకు అర్ధం లేదని వెల్లడించారు. కేంద్రం నిర్ణయం రాష్ట్ర వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడతుందని, ఆహార భద్రత లక్ష్యానికి తూట్లు పొడిచినట్లే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులను ప్రోత్సాహించామని, పత్తి, పామాయిల్, రెడ్‌గ్రామ్ వేయాలని కోరామని అన్నారు. రబీ సీజిన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరిసాగు పెట్టించామని గుర్తుచేశారు. ఎలాంటి ఆంక్షలు విధించకుండా తెలంగాణలో పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed