ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ మార్పు

by Batti.Sumithra |

రైతుల ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మార్పు చేశారని మండల వ్యవసాయాధికారి జెడ్ శ్రీధర్ తెలిపారు.

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ మార్పు
X

దిశ, చిలుకూరు : రైతుల ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మార్పు చేశారని మండల వ్యవసాయాధికారి జెడ్ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులకు వివరాలు తెలిపారు. రైతులు ప్రస్తుతం వినియోగిస్తున్న యాప్ ను అప్డేట్ చేసుకోవాలన్నారు. ఒకవేళ కాకపోతే గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి తిరిగి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలన్నారు. ప్రస్తుత యాప్ వెర్షన్ 1.0.12 అని ఏవో తెలిపారు. ఈ వెర్షన్ ఉన్న యాప్ లోనే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని శ్రీధర్ వివరించారు.

Next Story