అది కావాలని స్మూత్‌గా అడిగాడు.. ఆమె కూడా ఓకే చెప్పడంతో..

by Disha Web |
అది కావాలని స్మూత్‌గా అడిగాడు.. ఆమె కూడా ఓకే చెప్పడంతో..
X

దిశ, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని చించోలి గ్రామంలో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చేపూరి సంధ్యారాణి కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. రోజువారీ దినచర్యలో భాగంగా ఆదివారం దుకాణం తెరవడానికి వెళ్లింది.

ఇంతలో అపరిచిత వ్యక్తి వచ్చి, సిగరెట్ కావాలని అడిగాడు. ఆమె దుకాణం తెరచే ప్రయత్నాల్లో ఉండగానే, వెనుకనుంచి ఆమె మెడలోని బంగారం గొలుసు తెంపుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించిన, నెట్టివేసిన మెడలోని రెండు తులాల బంగారం గొలుసును దొంగ తెంపుకుని పరారయ్యాడు. దొంగ ద్విచక్ర వాహనంపై బాన్సువాడ మార్గంలో పారిపోయినట్టు స్థానికులు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాన్సువాడ రూరల్ సీఐ మురళి, ఎస్సై మన్సూర్ ఖాన్, ఏఎస్ఐ సీతారామమ్మ దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Next Story

Most Viewed