అర్ధరాత్రి దుకాణంలో ఆ పని చేసి.. నగదు దొంగిలించిన దుండగులు

by Dishanational2 |
అర్ధరాత్రి దుకాణంలో ఆ పని చేసి.. నగదు దొంగిలించిన దుండగులు
X

దిశ, చిలుకూరు: మండల కేంద్రం చిలుకూరు బస్టాండ్ సెంటర్లో శనివారం అర్ధరాత్రి ఒక దుకాణంలో చోరీ జరిగింది. బాధితుడు రేపాల చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రోజు లాగానే శనివారం రాత్రి కూడా దుకాణాన్ని మూసేశానన్నారు. రోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు షాపులోని నగదును ఇంటికి తీసుకెళ్తానని తెలిపారు. గత రాత్రి అత్యవసరంగా ఉండి నగదు తీసుకెళ్లలేదన్నారు. దాంతో దుకాణం వెనుక నుంచి లోపలికి వచ్చిన దుండగులు రూ.50 వేల నగదు దొంగిలించారని తెలిపారు. అలాగే షాపులోని సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి సంబంధిత సామగ్రిని కూడా ఎత్తుకెళ్లారని శేఖర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed