- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం.. చందాకు వచ్చిన బాలుడిపై వేడి నీళ్లు పోసిన సర్పంచ్
దిశ, కారేపల్లి: హోళీ పండుగను పురష్కరించుకుని గ్రామంలో చందాల కోసం పిల్లలు కోలాటం అడుతూ సర్పంచ్ ఇంటికి రాగా ఆగ్రహంతో వేడి నీళ్లు చల్లడంతో బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన కారేపల్లి మండలం గంగారం తండాలో 15న జరగగా అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగారం తండాకు చెందిన భూక్యా కౌశిక్(7)తో పాటు కొందరు పిల్లలు హోళీ పండుగను పురష్కరించుకుని కోలాటం ఆడుతూ చందాల కోసం సర్పంచ్ భూక్యా విజయ ఇంటికి వచ్చారు. చిన్నారులు సర్పంచ్ను చందాలు ఇవ్వాలని కోరారు. చందా ఇవ్వక జాప్యం చేస్తుండటంతో పిల్లలు అక్కడే కోలాటం ఆడుతున్నారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ విజయ తన చేతిలో ఉన్న ఉడుకు(వేడి) నీళ్లను పిల్లలపై చల్లడంతో భూక్యా కౌశిక్ ఒంటిపై పడి తీవ్రగాయాలయ్యాయి. కౌశిక్ను ఖమ్మంలోని ప్రయివేట్ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై బాలుడి తల్లి భూక్యా జ్యోతి శనివారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి ఎస్సై పోలోజు కుశకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.