- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు
అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకుని అధికారులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులపై కేసు నమోదైంది.

దిశ, దుండిగల్ : బహదూరపల్లికి చెందిన కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులు విధి నిర్వహణలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులతో దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 10న రోడ్ల ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్లో భాగంగా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు ప్రధాన రహదారిని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ సమయంలో కేబీఆర్ రెస్టారెంట్ నిర్వాహకులు అధికారుల విధులను అడ్డుకుని, సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్ఐఆర్ నం. 690/2026 కింద బీఎన్ఎస్ సెక్షన్ 132 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి. సతీష్ తెలిపారు.






