ముసలమడుగులో తాళం వేసిన ఇంట్లో చోరీ

by Jakkula.Mamatha |

బూర్గంపాడు మండల పరిధిలోని ముసలమడుగు గ్రామంలో ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి, బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ముసలమడుగులో తాళం వేసిన ఇంట్లో చోరీ
X

దిశ,​బూర్గంపాడు: బూర్గంపాడు మండల పరిధిలోని ముసలమడుగు గ్రామంలో ఒక ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి, బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ​ఘటనకు సంబంధించి​ బాధితుడు నూకల కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి సమీపంలోని హోటల్‌కు వెళ్లారు. ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్ళాక బీరువా,సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.​

దుండగులు ఇల్లు గుల్ల చేసి రూ.లక్షల్లో విలువైన వస్తువులను అపహరించుకెళ్లారు. 15 గ్రాముల బంగారం, ​250 గ్రాములు వెండి (వెండి కంచంతో కలిపి) టీవీ,హోమ్ థియేటర్ రూ.30 వేలు నగదు అపహరించారు. ​​బాధితుడి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ సీన్ వద్ద ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీమ్ ని రప్పించారు. పోలీసులు ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story