'తెలంగాణ నిరుద్యోగులు మరోసారి మోసపోవద్దు'

by Disha Web Desk 2 |
తెలంగాణ నిరుద్యోగులు మరోసారి మోసపోవద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 81 వేల ఉద్యోగాల ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ''తెలంగాణ నిరుద్యోగులు మరోసారి మోసపోవద్దు. ఉద్యోగ భర్తీ ప్రక్రియకు డెడ్‌లైన్ లేకుండా కేవలం ఎన్నికల స్టంట్‌గా తీస్కొచ్చి మరోసారి మోసం చేయడానికి సిద్ధం అయ్యారు పాలకులు. ఎప్పటి వరకు, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పే దమ్ము ఉందా...?'' అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన నిరుద్యోగులు ఎన్నికల స్టంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed