రూల్స్ పాటించని విద్యాలయాల పై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఎంఈవోకు బీఆర్ఎస్ నాయకుల వినతి

by Jakkula.Mamatha |

కార్పొరేట్ విద్యాలయాల దోపిడీ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను రక్షించాలని, రూల్స్ పాటించని విద్యాలయాల పై కఠిన చర్యలు తీసుకోవాలి.

రూల్స్ పాటించని విద్యాలయాల పై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఎంఈవోకు బీఆర్ఎస్ నాయకుల వినతి
X

దిశ, గోదావరిఖని: కార్పొరేట్ విద్యాలయాల దోపిడీ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను రక్షించాలని, రూల్స్ పాటించని విద్యాలయాల పై కఠిన చర్యలు తీసుకోవాలి. రామగుండం ఎంఈఓకు బీఆర్ఎస్ నాయకుల వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం స్కూల్స్, కాలేజీ ఫీజులు, బుక్స్ అధిక ధరల నియంత్రణ చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక నష్టం కలగకుండా చూడాలని, రూల్స్ పాటించని విద్యాలయాల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేష్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పున్నాం శశికుమార్, సడవేని రాజు, ఉప్పు సాయికుమార్, లక్కాకుల మహేందర్, గొట్టే నరేష్, సంతోష్, శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Next Story