BRS: రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైంది

by Gantepaka Srikanth |

సికింద్రాబాద్ అంటే లష్కర్ అని.. లష్కర్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని మండలి ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి స్పష్టం చేశారు.

BRS: రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ అంటే లష్కర్ అని.. లష్కర్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని మండలి ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి స్పష్టం చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్బంధం కొనసాగిస్తున్నదని ఆరోపించారు. నిర్బంధం అసమర్థుడి లక్షణమన్నారు. అమానుషాన్ని తెలంగాణ జాతి సహించదని తెలిపారు. రేవంత్‌రెడ్డి కౌంట్‌డౌన్‌కు నిదర్శనమని చెప్పారు. శాంతియుత ర్యాలీకి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పిరికితనంతో కుట్రతో ర్యాలీ అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదన్నారు.

Next Story