పాక్ జట్టులో రోహిత్, తిలక్, రింకూ.. ఫ్యాన్స్ ఫైర్

by Muthe.Rajitha |

పాక్, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జట్టులో రోహిత్, తిలక్, రింకూ పేర్లను బ్రాడ్ కాస్టర్లు డిస్ప్లే చేయడం సంచలనం రేపింది.

పాక్ జట్టులో రోహిత్, తిలక్, రింకూ.. ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటన సంచలనం రేపింది. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు బ్రాడ్ కాస్టర్లు డిస్ప్లే చేసిన పాకిస్తాన్ జట్టులో భారత ఆటగాళ్ల పేర్లు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార సమయంలో గ్రాఫిక్స్ టీమ్ అత్యంత అప్రమత్తంగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆటగాళ్ల స్థానంలో భారత ఆటగాళ్ల పేర్లను ప్రదర్శించడం అనేది ఊహించని పెద్ద పొరపాటు. ముఖ్యంగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి భారత స్టార్ ఆటగాళ్ల పేర్లు "Pakistan Test Career" అనే హెడ్డింగ్ కింద కనిపించడం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

సాంకేతిక లోపమా లేక పాత టెంప్లేట్‌ను మార్చడం మర్చిపోయారా అన్నది పక్కన పెడితే, ఈ 'బ్రాడ్‌కాస్ట్ బ్లండర్' సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు దారితీసింది. నిమిషాల్లోనే దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా భారత, పాకిస్తాన్ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో హోరెత్తించారు. రోహిత్ శర్మ పాకిస్తాన్‌కు కెప్టెన్సీ చేయడం ఏమిటంటూ సెటైర్లు వేయడం, అలాగే పాకిస్తాన్ జట్టులో భారత కుర్రాళ్లు చేరిపోయారంటూ చలోక్తులు విసిరారు. ఒక అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో ఇలాంటి ప్రాథమిక పొరపాట్లు జరగడం బ్రాడ్‌కాస్టర్ల నాణ్యతపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ప్రసారకర్తలు వెంటనే సరిదిద్దుకున్నప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఆ నెట్టింట వైరల్ అయింది.

Next Story