బ్రేకింగ్ న్యూస్.. గోదావ‌రిలో ముగ్గురు యువకులు గ‌ల్లంతు

by Disha Web Desk 12 |
బ్రేకింగ్ న్యూస్.. గోదావ‌రిలో ముగ్గురు యువకులు గ‌ల్లంతు
X

దిశ‌, ఏటురూనాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం ముల్ల‌క‌ట్ట బ్రిడ్జికి స‌మీపంలోని గోదావ‌రి నీటి ప్ర‌వాహంలో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాయి వ‌ర్ధ‌న్‌, స‌తీష్‌, సందీప్ అనే ముగ్గురు యువ‌కులు స‌మీపంలోని ల‌క్ష్మిదేవ‌ర ఆల‌యంలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు. ఈ మేరకు యువ‌కులు గోదావ‌రిలో స్నానానికి దిగారు. అయితే వ‌ర‌ద ప్ర‌వాహం పెర‌గ‌డంతో ముగ్గురు గ‌ల్లంతైన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed