ఫ్యాన్ తగిలి తెగిపడిన తల.. బాలుడు అక్కడికక్కడే మృతి

by Dishanational1 |
ఫ్యాన్ తగిలి తెగిపడిన తల.. బాలుడు అక్కడికక్కడే మృతి
X

దిశ, దేవరకొండ: పల్లీ పట్టే మిషన్ ఫ్యాన్ తగిలి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం గాజీనగర్ లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండ మల్లెపల్లి మండలం పేట జాన్- రాణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో తన వ్యవసాయ పొలంలో పల్లీలు పట్టే మిషన్ తెచ్చి పల్లీ చేనును మిషన్ లో వేస్తుండగా రెండో కుమారుడైన పేట మధు(7) మెడ మీద చున్నీ వేసుకుని మిషన్ దగ్గరికు వెళ్లాడు. ఫ్యాన్ నుండి వచ్చే గాలికి మెడపై ఉన్న చున్నీ ఫ్యాన్ కు చుట్టుకుని అతని తలకు తగిలి తలను కట్ చేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఎస్సై స్థానికులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండమల్లేపల్లి ఎస్ఐ నారాయణ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed