- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెల్గావి కార్పొరేషన్ ను దక్కించుకున్న బీజేపీ.. మేయర్గా ప్రీతి కామకర్, చేనేత సామాజిక వర్గానికి దక్కిన గౌరవం
బెల్గావి నూతన మేయర్గా ప్రీతి వినాయక్ కామకర్ ఎన్నిక. చేనేత సామాజిక వర్గానికి దక్కిన గౌరవం. నగర అభివృద్ధిపై మేయర్ కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకొని అధికార కాంగ్రెస్ పార్టీ (Congress party)కి షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ, బెల్గావి కార్పొరేషన్ (Belgaum Corporation)ను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఈ రోజు బెల్గావి నూతన మేయర్గా ప్రీతి వినాయక్ కామకర్ ఎన్నిక కావడం ఒక అనూహ్య పరిణామంగా మారింది. సాధారణంగా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉండే మేయర్ పీఠాన్ని, ఈసారి సామాజిక సమీకరణాలను తలకిందులు చేస్తూ చేనేత (Weaver) సామాజిక వర్గానికి కేటాయించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. బెల్గావి సౌత్ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ (Belagavi South MLA Abhay Patil) గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకం కేవలం ఒక పదవి కేటాయింపు మాత్రమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో బలహీన వర్గాల మద్దతు కూడగట్టే మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోంది.
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రీతి కామకర్ మాట్లాడుతూ.. తన లాంటి సామాన్య కార్యకర్తకు, అది చేనేత వర్గానికి మేయర్ పదవిని అప్పగించడం బీజేపీ (BJP) పార్టీ హైకమాండ్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. "ఇది సామాజిక న్యాయానికి దక్కిన అసలైన గౌరవం. బెల్గావి నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే నా ఏకైక లక్ష్యం" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వెనుకబడిన వర్గానికి నగర పాలక సంస్థ పగ్గాలు అప్పగించడంతో, బెల్గావి రాజకీయాల్లో కొత్త శకం మొదలైందని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. నూతన మేయర్గా బాధ్యతలు చేపట్టిన ప్రీతి కామకర్కు వివిధ సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.






