తెలంగాణలోనూ ఇదే రిపీట్ అవుతుంది.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
తెలంగాణలోనూ ఇదే రిపీట్ అవుతుంది.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగీ ఆదిత్యనాథ్ గెలవాలని దేశం మొత్తం కోరుకుందన్నారు. మోడీ హవాతో దేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోయిందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ జోస్యం చెప్పారు. ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిల్ చేసి గెలవాలనుకుందని కానీ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారన్నారు. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయని, అవినీతి, కుటుంబ పాలనను తొక్కించేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed