MLA Raja Singh: అమర్‌నాథ్ నుంచి ప్రాణాలతో వస్తామనుకోలేదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
BJP MLA Raja Singh, Family Escape Cloudburst at Amarnath Yatra
X

దిశ, వెబ్‌డెస్క్: BJP MLA Raja Singh, Family Escape Cloudburst at Amarnath Yatra| భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారీ వరదల్లో చిక్కుకొని సుమారు 45 మందికి పైగా గల్లంతు అయ్యారు. అయితే, ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రలో ఉన్న గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కూతురు వివాహం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వచ్చామని, ఈ యాత్రలో ఒక భయంకరమైన అనుభవం ఎదురైందని అన్నారు. వాతావరణం అనుకూలించక, హెలికాప్టర్ రద్దు చేసుకొని అతికష్టం మీద అమర్‌నాథ్ వచ్చామని, దర్శనం చేసుకొని అర కిలోమీటర్ కూడా నడవకముందే భయంకరమైన శబ్ధంతో వరద ప్రవాహం దూసుకొచ్చిందని అన్నారు. ఆ వరద ప్రవాహం చూసి, పెద్ద సంఖ్యలో భక్తులు భయంతో పరుగులు తీశారని వెల్లడించారు. మా కళ్లముందే అనేక మంది వరదల్లో కొట్టుకుపోయారని, వారిని చూసి మాకు చాలా భయం వేసిందని, అసలు ఇక్కడి నుంచి ప్రాణాలతో భయటపడతామా? అనే అనుమానం కూడా వచ్చిందని టెన్షన్ పడ్డట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. దాదాపు మూడు గంటల ఉత్కంఠ సమయం అనంతరం తాము కిందకు చేరుకున్నామని, నాకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉండటంతో పోలీసులు మాకు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాన్ని సమకూర్చినట్లు చెప్పారు.

Next Story

Most Viewed