Mamata Banerjee: అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చాలని బీజేపీ ప్రయత్నం : సీఎం మమతా బెనర్జీ

by Satheesh |
Mamata Banerjee Says, BJP is trying to break All Governments
X

కలకత్తా: Mamata Banerjee Says, BJP is trying to break All Governments| పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాషాయ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను విడగొడుతుందని అన్నారు. గత నెలలో ప్రభుత్వం ఆవిష్కరించిన అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో మమత విమర్శలు చేశారు. గురువారం షాహిద్ దివాస్ ర్యాలీలో ఆమె మాట్లాడారు. సైన్యాన్ని భర్తీ చేయడం లేదని, యువతతో ఆటలు ఆడొద్దని అన్నారు. అగ్నిపథ్‌కు లేకుండా ప్రజలను నేరుగా సైన్యంలోకి తీసుకోవాలని చెప్పారు. బియ్యానికి కూడా జీఎస్టీ వేస్తున్నారని, బీజేపీ నేతలు వాటిని తినరని చెప్పారు. బియ్యం, స్వీట్లు, లస్సీ, పెరుగు.. ఇలా అన్నింటిపై జీఎస్టీ వేస్తే తామేమి తినాలని ప్రశ్నించారు.

మా వస్తువులను తిరిగిచ్చి, వెళ్లిపోవాలని అన్నారు. మహారాష్ట్ర తర్వాత బెంగాల్ ను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందనే వ్యాఖ్యలపై స్పందిస్తూ, బెంగాల్ లో రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఈ ర్యాలీ సందర్బంగా పోలీసులు నగంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్కూళ్లు కూడా బంద్ ప్రకటించారు. అమరవీరుల దినోత్సవ ర్యాలీని నిర్వహించేటప్పుడు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కలకత్తా హైకోర్టు రాష్ట్ర అధికారులను ఆదేశించింది.

ఇది కూడా చదవండి: బీజేపీకి సీనియర్ ఎంపీ, మాజీ మంత్రి గుడ్ బై?


Next Story