బీజేపీ రాజ్యాంగ రక్షణ దీక్ష!

by Disha Web Desk 13 |
బీజేపీ రాజ్యాంగ రక్షణ దీక్ష!
X

దిశ, బెల్లంపల్లి: బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యే లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద బుధవారం రాజ్యాంగ రక్షణ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట క్రిష్ణ హాజరయ్యారు. దీక్షలో కూర్చున్న వారికి పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్, బెల్లంపల్లి మండల అధ్యక్షులు బుడిమే విజయ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బుల్రెడ్ల కేశవ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, జిల్లా కార్యదర్శి కోయిల్కార్ గోవర్ధన్, బెల్లంపల్లి మండల ఇంచార్జ్ రాజు లాల్ యాదవ్, తాండూర్ మండల ఇంచార్జ్ రేవెళ్ళి రాజలింగు, నేన్నల్ మండల ఇంచార్జ్ బద్దం వాసు రామ్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్, బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శంకర్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు గోమాస కమల, పట్టణ ఉపాధ్యక్షులు ఆడిచర్ల రామచంద్ర, పట్టణ లీగల్ సెల్ కన్వీనర్ గోలి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దుడపాక బలరాం, మహిళా మోర్చా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి, ప్రధాన కార్యదర్శి సంగీత కోళారియా తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed