అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

by Web Desk |
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ
X

దిశ, పటాన్‌చెరు: ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడుతున్న పటాన్‌చెరు టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేసింది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే.రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ప్రియాంక అలాను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. లంచం ఇవ్వనిదే ఫైళ్లపై సంతకాలు పెట్టని పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు.

సామాన్య ప్రజల దరఖాస్తులను పట్టించుకోని అధికారులు ముడుపులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.మహేందర్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed