టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న కీలక నేత

by Disha Web Desk |
టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న కీలక నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగానే జరుగుతాయన్న అంచనా నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి వీడేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. '' ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం 2018లో టీఆర్ఎస్ చేరాను. అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేస్తారని భావించా. కానీ పార్టీలో చేరినప్పటి నుంచి ప్రజలను కలవకూడదని పార్టీ పెద్దలు ఆదేశించారు. మూడేళ్లుగా ఎవరినీ కలవకుండా కట్టడి చేశారు. ఆలేరు ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నా'' అని లేఖలో భిక్షమయ్య గౌడ్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed