చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్.. పది పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-20 15:09:40  IST  )

2025-26 సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌‌ను పాఠశాల విద్యాశాఖ ఇవాళ సాయత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే.

చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్.. పది పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు!
X

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌‌ను పాఠశాల విద్యాశాఖ ఇవాళ సాయత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు జరగనున్నట్లుగా మంగళగిరిలోని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. అయితే, మార్చి 20న ఇంగ్లీష్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. కానీ, అదే రోజు రంజాన్ కావడంతో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో ఆ రోజు ఇంగ్లీష్ పరీక్షను మార్చి 21న నిర్వహించే అవకాశం ఉంది. కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి‌ తెలిపారు.

Next Story