‘విశ్వంభర’ నుంచి బిగ్ ట్రీట్.. అలాంటి అప్డేట్‌తో అంచనాలు పెంచే ప్లాన్‌లో మేకర్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-24 05:44:41  IST  )

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అంటేనే రికార్డుల రారాజు అని అంతా చర్చించుకుంటున్నారు.

‘విశ్వంభర’ నుంచి  బిగ్ ట్రీట్.. అలాంటి అప్డేట్‌తో అంచనాలు పెంచే ప్లాన్‌లో మేకర్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అంటేనే రికార్డుల రారాజు అని అంతా చర్చించుకుంటున్నారు. సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిరు, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘విశ్వంభర’ తో ప్రేక్షకులను ఒక అద్భుతమైన ఫాంటసీ లోకంలోకి తీసుకెళ్లబోతున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ (Vashistha)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీ, అనౌన్స్‌మెంట్ నుంచే టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. అయితే ‘విశ్వంభర’(Vishvambhara) ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. వాయిదా పడింది. గతంలో వచ్చిన గ్రాఫిక్స్ సినిమాల కంటే భిన్నంగా, హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలోనే సినిమా నుంచి ఒక సాలిడ్ వీడియో టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ టీజర్ కేవలం గ్లింప్స్ లాగా కాకుండా, మూవీలో ఉండబోయే భారీ ప్రపంచాన్ని, చిరంజీవి పవర్‌ఫుల్ గెటప్‌ను, అబ్బురపరిచే విజువల్స్‌తో చూపించబోతున్నారట. కాగా.. ఈ సినిమాలో చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. వీరిద్దరు చాలాకాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతుండటం విశేషం. ఇక ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్‌లో ఉండబోతోందని తెలుస్తోంది.

Read More..

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎఫెక్ట్.. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ మెగా డాటర్ పోస్ట్

Next Story