టీమిండియా వరుస ఓటములపై బీసీసీఐ అలర్ట్.. జూలై 19 తర్వాత సమీక్షా సమావేశం

by Malleboina Mahesh |

టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక బీసీసీఐ కీలక సమీక్షా సమావేశం.. లోపాలను సరిదిద్దడమే లక్ష్యమన్న కార్యదర్శి దేవజిత్ సైకియా!

టీమిండియా వరుస ఓటములపై బీసీసీఐ అలర్ట్.. జూలై 19 తర్వాత సమీక్షా సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు వరుస ఓటములతో నిరాశపరచడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదనే విషయాన్ని బీసీసీఐ నిశితంగా గమనిస్తోందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. శుక్రవారం వార్తా సంస్థ 'ఏఎన్ఐ' (ANI) తో మాట్లాడిన ఆయన.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఒడిదొడుకులు సహజమేనని, దీనిని జట్టు యొక్క ఒక దురదృష్టకరమైన "బ్యాడ్ ఫేజ్" గానే పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.

కోర్స్ కరెక్షన్‌పైనే ఫోకస్..

ఇంగ్లాండ్ టూర్‌లో లోపాలను సరిదిద్దేందుకు బీసీసీఐ త్వరలోనే ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుందని దేవజిత్ సైకియా వెల్లడించారు. "జూలై 19న వన్డే (ODI) సిరీస్ ముగిసిన తర్వాత జట్టు తిరిగి భారతదేశానికి వస్తుంది. ఆ వెంటనే జట్టులోని కోర్ మెంబర్స్ (ముఖ్య సభ్యులు), మేనేజ్‌మెంట్‌తో కలిసి మేము రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇంగ్లాండ్‌లో అసలు ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తాం" అని తెలిపారు. అయితే, ఈ సమావేశం పూర్తిగా జట్టు ప్రదర్శన, లోపాలను ఎలా సరిదిద్దాలి (Course Correction) అనే అంశాల చుట్టూనే సాగుతుందని.. వేరే ఏ ఇతర విషయాలూ ఇందులో చర్చకు రావని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే వన్డే సిరీస్‌లో టీమిండియా తిరిగి ఫామ్‌ అందుకుంటుందని బోర్డు ఆశాభావంతో ఉందని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు.

Next Story