CM KCRకు బండి సంజయ్ లేఖ.. ఎందుకో తెలుసా ?

by Dishanational2 |
CM KCRకు బండి సంజయ్ లేఖ.. ఎందుకో తెలుసా ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకానున్న నేపథ్యంలో నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కరోనా కారణంగా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు.

Next Story

Most Viewed