బీజేపీకి టచ్‌లో వెంకట్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన Bandi Sanjay

by Disha Web Desk 19 |
Bandi Sanjay Gives Clarity On Komatireddy Venkat Reddy Issue
X

దిశ, వెబ్‌డెస్క్: Bandi Sanjay Gives Clarity On Komatireddy Venkat Reddy Issue| కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న వ్యాఖ్యలు తాను చేయలేదని టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు మమ్మల్ని కలవలేదు, మాట్లాడలేదని.. కేవలం ఆయన ప్రధానిని కలిశారని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. తాము అనని మాటలను ప్రచారం చేయవద్దని సూచించారు. ఏ ఎంపీ అయినా ప్రధాని కలవడం సహజమని.. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు. అయితే, అభివృద్ధిపై చర్చించేందుకే కోమటిరెడ్డి ప్రధానిని కలిసి ఉంటారని పేర్కొన్నారు. మునుగోడులో ఉపఎన్నిక కోరుకున్నదే కేసీఆర్ అని.. మునుగోడు ఉపఎన్నికతో పాటుగా తెలంగాణలో ఎక్కడ ఎన్నిక వచ్చినా గెలిచేదేది బీజేపీయేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.

ఇది కూడా చదవండి: మోసం చేస్తున్న విద్యుత్ అధికారులు.. బిల్లింగ్ మిషన్లలో గోల్‌మాల్

Next Story