విరాట్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా: పీవీ సింధు

by Gantepaka Srikanth |

ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుని మళ్లీ పాత ఫామ్‌ను అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విరాట్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా: పీవీ సింధు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుని మళ్లీ పాత ఫామ్‌ను అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లో అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో విరాట్ ఇచ్చిన సలహాలు, చూపిన చొరవ తనకు ఎంతో కొండంత అండగా నిలిచాయని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పీవీ సింధు మాట్లాడుతూ.. తన ఫామ్ లేమితో సతమతమవుతున్న రోజుల్లో మానసిక స్థైర్యం కోసం విరాట్ కోహ్లీని సంప్రదించినట్లు తెలిపారు. "నా కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు విరాట్‌తో మాట్లాడాను. ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకుని, కష్టకాలంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. క్రీడా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎలా దాటాలో ఆయన చెప్పిన మాటలు నాలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి" అని సింధు పేర్కొన్నారు.

"కోహ్లీ ఇచ్చిన సూచనలు ఇప్పటికీ నా మనసులో నిలిచిపోయాయి. మైండ్‌సెట్‌ను ఎలా బలంగా ఉంచుకోవాలో ఆయన అందించిన సలహాలు నా పునరాగమనానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ సమయంలో అందించిన మద్దతుకు విరాటకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని పీవీ సింధు చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన జపాన్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన సింధు, మళ్లీ పాత సింధును తలపిస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో భారత క్రీడారంగంలో ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న ఈ అప్యాయత, పరస్పర గౌరవం క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.

Next Story