కేసీఆర్.. బీజేపీది ట్రైలర్ మాత్రమే.. మేమేంటో చూపిస్తే గుండె ఆగుతుంది

by Disha Web Desk |
కేసీఆర్.. బీజేపీది ట్రైలర్ మాత్రమే.. మేమేంటో చూపిస్తే గుండె ఆగుతుంది
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్యేలు అంటే సీఎం కేసీఆర్‌కు గజగజ వణుకు పుడుతుందని, అందుకే ప్లాన్ ప్రకారం సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. మా ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నిస్తారని, నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్, ఆయన బిడ్డా, కొడుకు , ఆయనకు రైట్, లెఫ్ట్ ఉన్న మంత్రులతోనే అసెంబ్లీ పెట్టుకోండని అన్నారు. ఇప్పటి వరకు బీజేపీది ట్రైలర్ మాత్రమే కేసీఆర్ చూశాడని, మేమేంటో చూపిస్తే ఆయన గుండె ఆగుతుందని బండి అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, ఈ ప్రభుత్వం కూడా అంతే అన్నారు. నీ కల్వకుంట్ల రాజ్యాంగం పని చేయదని బండి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పటికైనా ఆయన కండ్లు తెరవాలని హితవు పలికారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సచ్చిలుడైతే బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెండ్ ఎత్తి వేయాలి డిమాండ్ చేశారు. సీఎం తీరుపై గవర్నర్‌ను, రాష్ట్రపతిని కలుస్తామని బండి సంజయ్ వెల్లడించారు.

Next Story

Most Viewed