CSK ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. మరో స్టార్ ప్లేయర్ దూరం!

by Disha Web Desk 2 |
CSK ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. మరో స్టార్ ప్లేయర్ దూరం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియర్ ప్రీమియర్ లీగ్(IPL-2022) మార్చి 26న ప్రారంభం కానుంది. ఈ వేసవి సెలవుల్లో క్రీడాభిమానులను మరింత ఉత్సాహపరిచేందుకు బీసీసీఐ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్త జట్లు, కొత్త జెర్సీలతో ప్లేయర్లు సైతం సమరానికి సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ మార్చి 26న డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్ vs కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకోసం చెన్నైసూప‌ర్ కింగ్స్ ఇప్పటికే మ్యాచ్ వేదికైన ముంబైకి చేరుకుంది.


అయితే, ఇంత‌లోనే చెన్నై అభిమానులకు యాజమాన్యం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. కోల్‌కతాతో జరిగే ఫస్ట్‌ మ్యాచ్‌కు తమ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ అంబుబాటులో ఉండటం లేదని సీఎస్కే యాజమన్యం స్పష్టం చేసింది. వీసా సమస్య కారణంగా అతను ఇంకా ఇండియాకు రాలేకపోయారు. దీంతో అతను ఫస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని తెలిపింది. తొందరగా వీసా ఫార్మాలిటీస్ పూర్తిచేసి రెండో మ్యాచ్‌ నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఇప్పటికే పేస్ బౌలర్ దీపక్ చాహర్ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో మరో కీలక ఆటగాడు మొదటి మ్యాచ్‌కు దూరం కావడంతో సీఎస్కే అభిమానులు కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story