సింగరేణి ఎంపీడీవోగా బి.పద్మ బాధ్యతల స్వీకరణ

by Jakkula.Mamatha |

సింగరేణి మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో)గా బి.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

సింగరేణి ఎంపీడీవోగా బి.పద్మ బాధ్యతల స్వీకరణ
X

దిశ, కారేపల్లి: సింగరేణి మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో)గా బి.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతి పొంది సింగరేణి మండలానికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన రవీంద్రప్రసాద్ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు బి. పద్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story