ఆ బుక్‌లో కేజ్రీవాల్ ఏం రాశారు..? ఇప్పుడిదే హాట్ టాపిక్

by Dishanational1 |
ఆ బుక్‌లో కేజ్రీవాల్ ఏం రాశారు..? ఇప్పుడిదే హాట్ టాపిక్
X

దిశ, వెబ్ డెస్క్: ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం గుజరాత్ లో పర్యటించారు. అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని వారు సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న చరఖా తిప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని, చాలా భిన్నమైన అనుభూతి తమకు కలిగిందని వారు అన్నారు. మాన్ మాట్లాడుతూ.. పంజాబ్ లో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో చరఖా ఉంటదని అన్నారు. అదేవిధంగా ఆశ్రమంలోని విజిటర్ బుక్ లో కేజ్రీవాల్.. 'గాంధీ పుట్టిన దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది' అని రాశారు.






Next Story

Most Viewed