- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Atchannaidu: 'ఆయనను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధం'
దిశ, ఏపీ బ్యూరో: AP TDP Chief Atchannaidu Allegations On YCP Government| వైసీపీ మూడేళ్ల పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగెత్తి పోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..? వైసీపీని ఎప్పుడు గద్దె దించుదామా అని ఎదురుచూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు కార్యకర్తలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ట్విటర్ వేదికగా ఆరోపించారు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబునే ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు అని అన్నారు. కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన గురించి అర్థమైపోయింది. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారు అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ కుటుంబానికి ఆగస్టు నెల గండం ఉందా..?
- Tags
- Atchannaidu