ఏపీ మంత్రుల రాజీనామాకు ముహుర్తం ఖరారు

by Disha Web Desk |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో : మంత్రివర్గ విస్తరణకు సీఎం వైఎస్ జగన్ కసరత్తు పూర్తి చేశారు.కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి... ఎవరికి ఉద్వాసన పలకాలి అనే అంశంపై ఓ క్లారిటీకి వచ్చేశారు. అంతేకాదు కొత్తగా కేబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోనున్నారో దానికి సంబంధించి ఒక జాబితాను సైతం రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈనెల 27న మంత్రివర్గం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు కొత్త మంత్రివర్గం ప్రకటనతోపాటు ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది.

ఇకపోతే ఈసారి కేబినెట్ విస్తరణలో కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి కూడా మహిళకే హోంమంత్రి పదవి ఇస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆరుగురు మంత్రులను మినహా మిగతా అందరిని మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి కేబినెట్ విస్తరణ... ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంశాలపై ఓ క్లారిటీ రానుంది.

Next Story

Most Viewed