తిరువళ్వార్ కవితతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన బుగ్గన

by Disha Web Desk 2 |
తిరువళ్వార్ కవితతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన బుగ్గన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ 2022-23ను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ముందుగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23లో.. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు ఉంటాయి. నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సీఎం జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ రూపొందించాం' అని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందని తెలిపారు. అనంతరం తిరువళ్వార్ కవితను ప్రస్తావిస్తూ.. బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. మొత్తంగా రూ.2,56,256 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Next Story

Most Viewed