రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఏపీ స్పీకర్

by Dishanational1 |
రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఏపీ స్పీకర్
X

దిశ, ములుగు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీ సమేతంగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గైడ్ ద్వారా రామప్ప ఆలయం యొక్క విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంకి చేరుకున్నారు. ఏపీ స్పీకర్ కు డప్పు వాయిద్యాలతో మేడారం పూజారులు స్వాగతం పలికారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Next Story